నిజామాబాద్ అర్బన్: ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పరిష్కరిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నా రు. పాత కలెక్టరేట్ ప్రాంగణంలోని నవదుర్గ ఆలయంలో టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో బుధవారం బోనాల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన మహేశ్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగులు సమాజ సేవ తోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలూ నిర్వహించడం అభినందనీయమన్నారు. అర్బన్ ఎమ్మె ల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగులంతా కలిసి బోనాల పండుగ నిర్వహించడం, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను పాటించడం అభినందనీయమన్నారు. అ దనపు కలెక్టర్ భుజంగరావు మాట్లాడుతూ ఉ ద్యోగులు తమ బాధ్యతను నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. అంతకుముందు పాత కలెక్టరేట్ ప్రాంగణంలోని నవదుర్గ మాత ఆలయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ ఉమారాణి, టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షుడు సుమన్, మహిళా ఉ ద్యోగులు బోనాలను ఎత్తుకొని ఊరేగింపు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం మహా అ న్నదానం చేశారు. మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, టీఎన్జీవోస్ నాయకులు గైని గంగారాం, శ్రీనివాస్, మారుతి, పెద్దోళ్ల నాగరాజు, డీఎంహెచ్వో రాజ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు
మహేశ్కుమార్గౌడ్
టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో
ఘనంగా బోనాల పండుగ


