ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉండాలి

Jul 20 2026 1:14 AM | Updated on Jul 20 2026 1:14 AM

ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉండాలి

నిజామాబాద్‌ రూరల్‌: ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ఉండి రాజకీయంగా ఎదగాలని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఉత్తర తిరుమల క్షేత్రంలో వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. ఆషాఢ మాసంలో ప్రతి ఏడాది వనభోజనాలను ఆనవాయితీగా నిర్వహించడం అభినందనీయమన్నారు. అంతకుముందు వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని పూజలు చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ధన్‌పాల్‌ శ్రీనివాస్‌ గుప్తా, ఇల్లెందుల ప్రభాకర్‌, కోశాధికారి గాలి నాగరాజు, కార్యవర్గ సభ్యులు, ఆలయ ధర్మకర్త సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement