ప్రభుత్వం వరికే కాకుండా ప్రత్యామ్నాయ పంటలకు సైతం బోనస్ ఇచ్చి ప్రోత్సహించాలి. రాష్ట్రంలో పీఎం ఫసల్ బీమా యోజన అమలు చేయాలి. ఈ పథకం అమలులో లేకపోవడం కారణంగా పంటలు నష్టపోతున్న రైతులకు కనీసం పెట్టుబడులు కూడా మిగలడం లేదు. ప్రభుత్వం సీజన్కు ముందే రైతులను అప్రమత్తం చేయాల్సింది. మెజార్టీ రైతులు పంటలు వేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటిని ఎస్సారెస్పీ, హల్దీ ప్రాజెక్టుల్లో నీటి నిల్వకు వినియోగించాలి.
– ధన్పాల్ సూర్యనారాయణ,
ఎమ్మెల్యే, అర్బన్


