క్లిష్టమైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటలను మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో వరి ఎక్కువగా పండుతున్నందున గన్నీ బ్యాగులకు విపరీతమైన డిమాండ్ ఉంది. కానీ ఇక్కడ జనపనార సాగు లేదు. మనకు 22 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం. ఇందుకు అనుగుణంగా జ్యూట్ పరిశ్రమను ఏర్పాటుచేసి, పంటలను ప్రోత్సహిస్తే రైతులకు మేలు జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో నీరు నిల్వ చేయకపోవడంతో నీరంతా సముద్రంలో కలుస్తోంది. ఆ నీటిని ఒడిసి పట్టి శ్రీరామ్సాగర్, నిజాంసాగర్, హల్దీ వాగువరకు పంపింగ్చేస్తే జిల్లావాసులకు మేలు జరుగుతుంది.
– పైడి రాకేశ్రెడ్డి, ఎమ్మెల్యే, ఆర్మూర్


