కమ్మర్పల్లి(భీమ్గల్): కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమ గ్ర సవరణ(సర్) ప్రక్రియపై భీమ్గల్ తహసీల్ కార్యాలయంలో అధికారులు, రాజకీ య నాయకులతో అడిషనల్ కలెక్టర్ భుజంగరావు బుధవారం సమీక్ష నిర్వహించారు. మండలంలో 2 వేల ఓట్లకు సంబంధించి నమోదు, అనుబంధ ఫామ్ల పరిశీలనపై చ ర్చించారు. రాజకీయ పార్టీ నాయకులు, అధికారులు సమన్వయంతో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. తహసీల్దార్ కిరణ్కుమార్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, బీఎల్వోలు పాల్గొన్నారు.


