ముధోల్: నియోజకవర్గ కేంద్రం ముధోల్లో ని ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తరలిస్తే చర్యలు తీసుకుంటామని మైనింగ్ ఏడీ తిరుమల్రావు తెలిపారు. రెవెన్యూ, మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో గురువారం సర్వేచేశారు. ఇటీవల ముధో ల్ గ్రామస్తులు మొరం తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో 425 సర్వే నంబర్లోని భూమిలో మొర్రం తవ్వకాలను అరికట్టాడానికి సీసీ కెమెరాలు, నిఘా వ్యవస్థను పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు. అక్రమంగా మొరం తరలించకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


