పెరిగిన కేసులు.. తగ్గిన నేరాలు | - | Sakshi
Sakshi News home page

పెరిగిన కేసులు.. తగ్గిన నేరాలు

Dec 31 2025 8:34 AM | Updated on Dec 31 2025 8:34 AM

పెరిగ

పెరిగిన కేసులు.. తగ్గిన నేరాలు

● జిల్లాలో 2024లో 3,524 నమోదుకాగా, 2025లో 4,162 కేసులు నమోదయ్యాయి. 638 కేసులు పెరిగాయి. అత్యధికంగా నిర్మల్‌ పట్టణ పోలీస్‌స్టేషన్లో 654, అత్యల్పంగా పెంబి పోలీస్‌ స్టేషన్లో 91కేసులు నమోదయ్యాయి. ● గతేడాది 16 హత్య కేసులు నమోదైతే, ఈ ఏడాది 14 నమోదయ్యాయి. ఇందులో లైంగిక వేధింపులు, గొడవల కారణంగా నలుగురు చొప్పున, కుటుంబకలహాలతో ముగ్గురిని చంపేశారు. ● గతేడాది అన్నిరకాల దొంగతనాలు కలిపి 466 నమోదు కాగా, ఈసారి 517కు పెరిగాయి. ఇందులో కేవలం 149 కేసులను ఛేదించారు. పగటిపూట ఇళ్లలో 29 చోరీలు చేయగా, రాత్రిపూట 166 కన్నాలు వేశారు. చిన్నపాటి దొంగతనాలు 313 కాగా, దోపిడీ కేసులు నాలుగు నమోదయ్యాయి. మొత్తం రూ.2,53,09,766 సొత్తు చోరీ కాగా, రూ.89,09,510 రికవరీ చేశారు. గతేడాదితో పోలిస్తే రికవరీ 6 శాతం పెరిగింది.

ఈఏడాది మొత్తం 4,162 కేసులు

ఈసారీ నిర్మల్‌టౌన్‌లోనే అత్యధికం

రోడ్డుప్రమాదాల్లో 154మంది మృతి

కనిపించిన ‘గాంజాగస్తీ’ ప్రభావం

నిర్మల్‌/నిర్మల్‌టౌన్‌: జిల్లాలో గతేడాదితో పోలిస్తే 2025లో నేరాలు తగ్గినా కేసుల సంఖ్య మాత్రం పెరిగింది. ఈఏడాది రోడ్లు రక్తంతో తడిసిపోయాయి. గాంజాగస్తీ పేరిట చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలనిచ్చింది. ఇక పట్టపగలే చైన్‌స్నాచింగ్‌లు, చోరీలు జిల్లావాసులను కలవరపెట్టాయి. ఈఏడాది దొంగతనాలు భారీగా పెరిగాయి. చోరీ అయిన ఫోన్లను మాత్రం భారీగా పట్టుకున్నారు.

గత ఏడాదితో పోలిస్తే..

నెత్తురోడిన రోడ్లు..

ఈఏడాది జిల్లా రహదారులు రక్తమోడాయి. గతేడాది మొత్తం 390 ప్రమాదాల్లో 133 మంది చనిపోయారు. 2025లో ఏకంగా 568 రోడ్డుప్రమాదాలు జరిగాయి. అందులో ఏకంగా 154 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో చాలామంది మద్యం తాగి వాహనాలను నడపడంతో ప్రాణాలు కోల్పోయారు. గతేడాది 3,606 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు కాగా, ఈఏడాది ఏకంగా 7,908 కేసులు నమోదుచేశారు.

ప్రాణాలు కాపాడిన డయల్‌–100..

డయల్‌–100కు స్పందన పెరుగుతోంది. దీనివల్ల చాలామంది ప్రాణాలు కాపాడబడుతున్నాయి. ఈ సంవత్సరంలో మొత్తం 22,327 డయల్‌–100 కాల్స్‌ స్వీకరించారు. బాసర గోదావరి నది, జిల్లాకేంద్రంలోని చెరువుల్లో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లిన చాలామందిని డయల్‌–100ద్వారా వచ్చిన సమాచారంతో పోలీసులు రక్షించారు.

సైబర్‌క్రైమ్‌పై అవగాహన..

ఈక్రమంలో 2023లో సైబర్‌ మోసాలపై 17 కేసులు కాగా, 2024లో 49 అయ్యాయి. ఈఏడాది 52కు పెరిగాయి. మాయమాటలతో ఈ కేసులన్నిటినీ కలి పి ఏకంగా రూ.3,90,93,168 కొట్టేశారు. ఇందులో కేసులు నమోదైన తర్వాత పోలీస్‌ శాఖ బ్యాంకర్ల సహకారంతో రూ.81,82,678 ఫ్రీజ్‌ చేయించారు. బాధితులకు రూ.30,27,035 తిరిగి ఇప్పించారు.

కలవర పెట్టిన చైన్‌స్నాచింగ్‌లు, చోరీలు

2024, 2025లలో

నమోదైన కేసుల వివరాలు..

కేసులు 2024 2025

మర్డర్లు 16 14

దొంగతనాలు 466 517

రేప్‌ కేసులు 39 41

కిడ్నాప్‌ కేసులు 34 41

అట్రాసిటీ 40 22

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ 3,606 7,908

రోడ్డుప్రమాదాలు 390 568

సైబర్‌ క్రైమ్‌ 49 52

ఆపరేషన్‌ స్మైల్‌ 136 123

సీఈఐఆర్‌ 1,081 1,806

ఈ–చలాన్‌ 1,47,968 1,80,429

జీవితఖైదు 07 02

పెరిగిన కేసులు.. తగ్గిన నేరాలు 1
1/1

పెరిగిన కేసులు.. తగ్గిన నేరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement