బద్రీనాథ్‌: భారీగా విరిగిపడ్డ మంచుచరియలు.. చిక్కుకున్న కార్మికులు | Uttarakhand Badrinath Avalanche Accident Latest news Updates | Sakshi
Sakshi News home page

బద్రీనాథ్‌: భారీగా విరిగిపడ్డ మంచుచరియలు.. చిక్కుకున్న కార్మికులు

Feb 28 2025 2:05 PM | Updated on Feb 28 2025 3:53 PM

Uttarakhand Badrinath Avalanche Accident Latest news Updates

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) హిమపాతం భారీ బీభత్సం సృష్టిస్తోంది.  గత కొన్ని రోజులుగా భారీగా మంచుకురుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం చమోలి-బద్రినాథ్‌ (Badrinath) జాతీయ రహదారిపై భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మంచులో ((Avalanche) 57మంది రోడ్డు నిర్మాణ కార్మికులు కూరుకుపోయారు.

మంచు చరియలు విరిగిపడడంతో అప్రమత్తమైన సహాయకబృందాలు 10 మంది కార్మికులను రక్షించాయి. సమాచారమందుకున్న పోలీసులు, బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.  మిగిలిన కార్మికుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ గాలింపు చర్యల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్‌,ఎన్‌డీఆర్‌ఎఫ్‌ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి.

  

మంచు చరియలు కింద రోడ్డు నిర్మాణ కార్మికులు చిక్కుకున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎక్స్‌ వేదికగా ధృవీకరించారు. మంచు చరియల కింద చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా బయట పడాలని ప్రార్థించారు.

చమోలి జిల్లా మనా గ్రామ సమీపంలో బోర్డర్‌ రోడ్డు ఆర్గనైజేషన్‌ (బ్రో) చేపడుతున్న నిర్మాణ పనులలో చాలా మంది కార్మికులు మంచు చరియల కింద చిక్కుకున్నారనే విచారకరమైన సమాచారం అందింది. నిర్మాణ కార్మికులను రక్షించేందుకు ఐటీబీపీ, బ్రో రెస్క్యూ బృందాలతో పాటు ఇతర రెస్క్యూ టీమ్‌లు  సహాయక చర్యలను నిర్వహిస్తున్నాయి. కార్మికులందరూ సురక్షితంగా ఉండాలని నేను ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.    

Badrinath:  మంచు తుపానులో చిక్కుకుపోయిన 57 మంది వర్కర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement