పట్టాలు తప్పిన సబర్మతి రైలు | Sabarmathi-Agra Superfast Rail Derailed In Rajasthan | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన సబర్మతి రైలు.. పలువురికి గాయాలు

Mar 18 2024 8:32 AM | Updated on Mar 18 2024 9:45 AM

Sabarmathi Superfast Rail Derailed In Rajastan - Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌లో సబర్మతి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. గూడ్స్‌ రైలును ఢీకొట్టిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. అజ్మీర్‌లోని మడర్‌ రైల్వేస్టేషన్‌లో సోమవారం తెల్లవారుజామున ఒంటి గంటకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సబర్మతి రైలులోని పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

సబర్మతి సూపర్‌ఫాస్ట్‌ డ్రైవర్‌ అత్యవసర బ్రేకులు వేసి రైలును ఆపడానికి ప్రయత్నించినప్పటికీ అది గూడ్స్‌ రైలును ఢీ కొట్టింది. ఈ ఘటనపై నార్త్‌ వెస్టర్న్‌ రైల్వే ఎక్స్‌(ట్విటర్‌)లో ఒక పోస్టు చేసింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది.  ప్రమాదానికి సంబంధించి వివరాల కోసం హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. 

ఇదీ చదవండి.. కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement