రాహుల్‌ భావితరాలు కూడా.. ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించలేవు | Rahul Gandhi nor his descendants will be able to restore Article 370 | Sakshi
Sakshi News home page

రాహుల్‌ భావితరాలు కూడా.. ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించలేవు

Nov 9 2024 6:31 AM | Updated on Nov 9 2024 6:31 AM

Rahul Gandhi nor his descendants will be able to restore Article 370

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా 

సాంగ్లి (మహారాష్ట్ర): కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాం«దీ, ఆయన వారసులు కూడా జమ్మూశ్మీమర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్‌ 370 పునరుద్ధరించలేరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. అది వారి వల్లకాదన్నారు. సాంగ్లిలో మహాయుతి తరఫున శుక్రవారం అమిత్‌ షా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరించాలని సీఎం ఒమర్‌ అబ్దుల్లా ప్రభుత్వం బుధవారం జమ్మూశ్మీమర్‌ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనికి కాంగ్రెస్‌ మద్దతునివ్వడంతో అమిత్‌ షా హస్తం పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు. 

ఆర్టికల్‌ 370 రద్దును విపక్ష నేతలు రాహుల్‌ గాందీ, ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్‌ శరద్‌ పవార్‌లు వ్యతిరేకించారని షా గుర్తుచేశారు. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్‌ గడ్డపై నుంచి చెబుతున్నా.. రాహుల్‌ బాబా. మీరు లేదా మీ నాలుగోతరం వారసులు కూడా ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించలేరు. శ్మీమర్‌ కోసం దేశంలోని ప్రతి వ్యక్తి పోరాటానికి సిద్ధంగా ఉన్నారు’అని అమిత్‌ షా అన్నారు.

 ‘ఆర్టికల్‌ 370ని రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నపుడు పార్లమెంటులో నేనా బిల్లును ప్రవేశపెట్టాను. రాహుల్‌ గాం«దీ, మమతా బెనర్జీ, శరద్‌ పవార్, అఖిలేశ్‌ యాదవ్, ఎంకే స్టాలిన్‌లు దీన్ని వ్యతిరేకించారు. దీనివల్ల శ్మీమర్‌ లోయలో రక్తపాతం జరుగుతుందన్నారు. రక్తం ప్రవహించడం మాట అటుంచితే కనీ సం రాయి విసిరే సాహసం కూడా ఎవరూ చేయలేదు’అని అమిత్‌ షా పేర్కొన్నారు. యూపీఏ హయాంలో తరచూ ఉగ్రదాడులు జరిగేవి. ఉరి, పుల్వామా ఘటనల తర్వాత చేపట్టిన సర్జికల్‌ స్ట్రైక్స్‌తో పాకిస్తాన్‌లోని తీవ్రవాదులు తుడిచిపెట్టుకుపోయారని ఆయన అన్నారు. 70 ఏళ్లుగా అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని కాంగ్రెస్‌ అడ్డుకుందని ఆరోపించారు. మోదీ ప్రయత్నాల వల్ల అది సాకారమైందని అమిత్‌ షా అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement