ఢిల్లీ టెర్మినల్‌పై కొత్త చర్చ.. మోదీనా లేక కాంగ్రెసా? | Political Comments Involve In Delhi Terminal Collapse Incident | Sakshi
Sakshi News home page

ఢిల్లీ టెర్మినల్‌పై కొత్త చర్చ.. మోదీనా లేక కాంగ్రెసా?

Jun 28 2024 12:39 PM | Updated on Jun 28 2024 2:54 PM

Political Comments Involve In Delhi Terminal Collapse Incident

ఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో భారీ వర్షాల కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్‌-1 రూఫ్‌ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఇక, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. అలాగే, అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.

కాగా, విమానాశ్రయంలో పైకప్పు కూలిన ప్రదేశాన్ని శుక్రవారం ఉదయం రామ్మోహన్‌ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూలిపోయిన టర్మినల్‌ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమాన ప్రయాణీకులు అందరికి తగిన ఏర్పాట్లు చేశాం. ఈ ప్రమాదానికి కారణాలను తెలుసుకుంటాం. ఈ టెర్మినల్‌ను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించినట్టు ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. అది నిజం కాదు. 2009లో టెర్మినల్‌ నిర్మాణం జరిగిందని క్లారిటీ ఇచ్చారు.

మరోవైపు.. ఈ ఘటనలో చనిపోయినవారి కుటుంబానికి రూ.20లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే, గాయపడిన వారికి రూ.3 లక్షల సాయం అందించనున్నట్టు తెలిపారు. అలాగే, గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రామ్మోహన్‌ పరామర్శించారు.

ఇక, ఈ ప్రమాదంపై కాంగ్రెస్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఈ టెర్మినల్‌ను ప్రారంభించారు. 2024వ ఏడాదిలోనే దీన్ని ప్రారంభించారు. మోదీ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. బీజేపీ హయాంలో గత పదేళ్లలో పలు నిర్మాణాలు కూలిపోతున్నాయి. ఇలాంటి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement