PMAY: గ్రామాల్లో మరో 2 కోట్ల ఇళ్లు | PMAY: Construction of 2 crore more houses under PM Awaas Yojana | Sakshi
Sakshi News home page

PMAY: గ్రామాల్లో మరో 2 కోట్ల ఇళ్లు

Aug 10 2024 5:32 AM | Updated on Aug 10 2024 5:32 AM

PMAY: Construction of 2 crore more houses under PM Awaas Yojana

కేంద్ర కేబినెట్‌ నిర్ణయం 

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన–గ్రామీణ్‌(పీఎంఏవై–జీ) పథకం కింద గ్రామాల్లో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. 

2024–25 నుంచి 2028–29కాలానికి గ్రామాల్లో పీఎం ఆవాస్‌యోజన అమలుపై గ్రామీణాభివృద్ధి శాఖ  ఇచి్చన ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన–పట్టణ(పీఎంఏవై–యూ) పథకం కింద రూ.2.30 లక్షల కోట్ల సాయం అందించనున్నారు. ఉద్యానరంగంలో చీడపీడలు తగ్గించడం, మెరుగైన విత్తనాలను సృష్టించడం, పూలు, పండ్ల దిగుబడి పెంచడమే లక్ష్యంగా క్లీన్‌ ప్లాంట్‌ ప్రోగ్రామ్‌(సీపీపీ)కి కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. ఉద్యానరంగంలో విప్లవాత్మక మార్పుల కోసం రూ.1,765.67 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఆ ‘క్రీమీలేయర్‌’ రాజ్యాంగంలో లేదు 
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ అమలుకు ఆస్కారం లేదని కేంద్రం వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్‌ల అమలు విషయంలో క్రీమీలేయర్‌ నిబంధన లేదని స్పష్టంచేసింది. తాజాగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సూచనల నేపథ్యంలో దీనిపై భేటీలో విస్తృతంగా చర్చ జరిగిందని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement