భారత్‌లో అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించిన ప్రధాని

PM Narendra Modi Inaugurates Purvanchal Expressway In Uttar Pradesh - Sakshi

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లో సుల్తాన్‌పూర్ జిల్లా క‌ర్వాల్ ఖేరీ వ‌ద్ద ప్రధానమంత్రి నరేం‍ద్ర మోదీ పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించారు. యూపీ ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మిక ప్రాజెక్టులలో ఇది ఒకటి. ఈ ప్రతిష్టాత్మిక ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు యూపీ సీఎం యోగీ ఆదిత్య‌నాథ్‌, గవర్నర్‌ ఆనందీబెన్ ప‌టేల్ కూడా పాల్గొన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం ఆరు లేన్లు ఉండగా.. వైమానిక విన్యాసాలకు, యుద్ధవిమానాలు దిగడానికి, టేకాఫ్‌ కావడానికి వీలుగా రోడ్లను నిర్మించారు. 

ఈ ఎక్స్‌ప్రెస్‌ వే వల్ల యూపీలోని లక్నో నుంచి బిహార్లోని బక్సర్‌ మధ్య ప్రయాణ సమయం 3 గంటలు తగ్గుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్ వే లక్నోలోని చాంద్ సరాయ్‌లో ప్రాంతంలో మొదలై ఘాజీపూర్ జిల్లాలోని హైదరియా గ్రామంలో ముగుస్తుంది.  దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్ వే గా పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే నిలిచింది. దీని పొడవు 341 కిలోమీటర్లు. అంతేకాదు ఇది అజంగఢ్, బారాబంకి, అమేథి, సుల్తాన్‌పూర్, అయోధ్య, అంబేద్కర్‌నగర్, ఘాజీపూర్, మౌ గుండా తదితరప్రాంతాలను కలుపుతూ వెళ్తుంది.

చదవండి: Hyderabad: కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన 13 ఏళ్ల బాలిక

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top