Hyderabad: కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన 13 ఏళ్ల బాలిక

A 13 Year Old Girl From Hyderabad Scaled Africa Highest Mountain Kilimanjaro - Sakshi

హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన 13 ఏళ్ల బాలిక మురికి పులకిత హస్వి ఇటీవల ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వతమైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. ఈ మేరకు మురికి పులకిత హస్వి మాట్లాడుతూ..."ఇది ఒక సాహసోపేతమైన అనుభవం. కిలిమంజారో పర్వతం పై  అన్ని వాతావరణ పరిస్థితులను ఎదుర్కొవాల్సి ఉంటుంది.

(చదవండి: భారత్‌, పాకిస్తాన్‌ పర్యటన కోసం లెవల్ వన్ హెల్త్ నోటీసులు)

అంతేకాదు ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిని ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంపుకు ముందు మూడు నెలల నుంచే ఈ పర్వతారోహణకు సన్నద్ధం  కావాల్సి ఉంది. పైగా పర్వతారోహణకు మానసికంగా దృఢంగా ఉండాలి. అందుకోసం యోగా, మెడిటేషన్‌ వంటివి చేసేదాన్ని. నేను 2024కి ముందు మొత్తం ఏడు శిఖరాలను అధిరోహించాలనుకుంటున్నాని అందుకోసం నేను ఇప్పటి నుంచే అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాను. " అని చెప్పింది.

(చదవండి: మేడం..! ఈ పర్స్‌ మీదేనా.. పో..పోవయ్యా నాది కాదు!!.. ట్విస్ట్‌ అదే..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top