‘సింధూర్‌’ సమయంలో ప్రధాని మోదీ ఏం చేశారంటే.. | PM Modi Monitored Operation Sindoor Airstrikes Through The Night, Says Minister Jitendra Singh | Sakshi
Sakshi News home page

‘సింధూర్‌’ సమయంలో ప్రధాని మోదీ ఏం చేశారంటే..

Jun 4 2025 4:00 PM | Updated on Jun 4 2025 4:55 PM

PM Monitored OP Sindoor Through the Night Minister Jitendra Singh

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాక్‌ జరిపిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్‌ ‘ఆపరేషన్‌ సింధూర్‌(Operation Sindhur)’ పేరిట ‍ప్రతీకార దాడులు చేపట్టింది. ఈ వైమానిక దాడులను ప్రధాని నరేంద్ర మోదీ రాత్రంతా పర్యవేక్షించారని, ఉగ్రవాదాన్ని తిప్పికొట్టే విషయంలో ఆయనకున్న సంకల్పాన్ని ఈ దాడులు మరింత బలోపేతం చేశాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎన్‌డీటీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

మే ఏడున భారత సైన్యం పా​క్‌, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ప్రదేశాలపై దాడులు చేసిందని, జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నదని సింగ్ తెలిపారు. ఆ సమయంలో ప్రధాని మోదీ తన ఇతర వ్యాపకాలను పక్కనపెట్టి, పరిస్థితులను అనుక్షణం పర్యవేక్షించారన్నారు. ప్రశాంతత అలవాటైన ఆయనకు ఆందోళన అంటే ఏమిటో తెలియదని తాను అనుకున్నానని సింగ్‌ అన్నారు. గతంలో ప్రధాని రాత్రివేళల్లో కూడా పని చేశారని, అయితే ఇప్పుడు తాను చూసినది ప్రత్యేకమైనదని సింగ్‌ తెలిపారు.

పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుకుంటుండటంతో ప్రధాని రక్షణ దళాలకు అక్కడున్న పరిస్థితులు, వారి విచక్షణ ఆధారంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను ఇచ్చారన్నారు. ఇటువంటిది గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. ఆ సమయంలో ప్రధాని మోదీ(Prime Minister Modi) ఎంతో స్పష్టతతో నిర్ణయం తీసుకున్నారని, పౌరులకు హాని కలిగించకుండా, ఉగ్రవాద శిబిరాలను, ఉగ్రవాద వనరులను అణిచివేయాలని  సూచించారన్నారు. పహల్గామ్ ఉగ్ర దాడి  అనంతరం భారత్‌ ఎంతో సంయమనంతో  ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని, దాడులు చేసిందని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ‘సిందూర్’లో తునాతునకలైన పాక్‌ యుద్జ విమానాలివే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement