నట్వర్‌ సింగ్‌ మృతికి ప్రధాని మోదీ సంతాపం | PM Modi Condoles Natwar Singh | Sakshi
Sakshi News home page

నట్వర్‌ సింగ్‌ మృతికి ప్రధాని మోదీ సంతాపం

Aug 11 2024 11:07 AM | Updated on Aug 11 2024 12:03 PM

PM Modi Condoles Natwar Singh

భారత విదేశాంగశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నట్వర్ సింగ్(93) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నట్వర్‌ సింగ్‌ మృతికి పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ఎక్స్‌లో నట్వర్‌సింగ్‌ మృతికి సంతాపం తెలిపారు. ఆయన సేవలను మోదీ కొనియాడారు. ప్రపంచ దౌత్యం, విదేశాంగ విధానాల విషయంలో  నట్వర్‌సింగ్‌ సేవలు అమోఘమన్నారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, సానుభూతి తెలియజేస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత్‌- యూఎస్ అణు ఒప్పందం విషయంలో ఆయన కీలకపాత్ర పోషించారు. సింగ్‌ రచనలు పలు అంశాలపై లోతైన అవగాహనను కలిగించాయి.  ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు.  

సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో సింగ్‌కు నివాళులర్పించారు. ‘విదేశాంగశా్‌ మాజీ మంత్రి నట్వర్‌సింగ్‌ మృతి వార్త బాధాకరం. భగవంతుడు ఆయన కుటుంబ సభ్యులకు దీనిని భరించే శక్తిని ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement