ఐటీ సోదాల్లో రూ.102 కోట్ల సొత్తు స్వాధీనం | Nearly Rs 94 cr cash, jewellery seized after IT searches govt contractors, realty developers | Sakshi
Sakshi News home page

ఐటీ సోదాల్లో రూ.102 కోట్ల సొత్తు స్వాధీనం

Oct 17 2023 5:24 AM | Updated on Oct 17 2023 5:24 AM

Nearly Rs 94 cr cash, jewellery seized after IT searches govt contractors, realty developers - Sakshi

న్యూఢిల్లీ: కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాల్లో ఇప్పటి వరకు రూ.102 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం ఆదాయ పన్ను(ఐటీ)శాఖ తెలిపింది.

ఈ నెల 12వ తేదీ నుంచి బెంగళూరు సహా 55 ప్రాంతాల్లో దాడులు జరిపి లెక్కల్లో చూపని రూ.94 కోట్ల నగదుతోపాటు రూ.8 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు, 30 ఖరీదైన విదేశీ తయారీ గడియారాలు కలిపి మొత్తం రూ.102 కోట్ల సొత్తును పట్టుకున్నామని వివరించింది. అక్రమ సొత్తుకు సంబంధించి డాక్యుమెంట్ల హార్డు కాపీ, డిజిటల్‌ డేటా తదితర సాక్ష్యాధారాలను కూడా చేజిక్కించుకున్నామని తెలిపింది. బోగస్‌ కొనుగోలు రసీదుల ద్వారా భారీగా పన్ను ఎగవేతకు గురైనట్లు కూడా         గుర్తించామంది.

Advertisement
 
Advertisement
Advertisement