Breadcrumb
Live Updates
మణిపూర్ ఎన్నికలు: ముగిసిన పోలింగ్.. సాయంత్రం 5 గంటల నాటికి 78.03% ఓటింగ్
సాయంత్రం 5 గంటల నాటికి 78.03% ఓటింగ్..
మణిపూర్లో సాయంత్రం 5 గంటల నాటికి 78.03% ఓటింగ్ నమోదైంది
కాంగ్పోక్పి జిల్లాలో అత్యధికంగా 82.9%
బిష్ణుపూర్లో అత్యల్పంగా 73.44%
ఇంఫాల్ తూర్పు 76.64%
ఇంఫాల్ వెస్ట్ 82.19%
బిష్ణుపూర్ 73.44%
చురచంద్పూర్ 74.45%
కాంగ్పోక్పి 82.19%
మధ్యాహ్నం 3 గంటల వరకు 67.22% ఓటింగ్
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడతలో మధ్యాహ్నం 3 గంటల వరకు 67.22% ఓటింగ్ నమోదైంది.
మణిపూర్ ఎన్నికల సిబ్బంది అనుమానాస్పద మృతి
ప్రధాన ఎన్నికల కార్యాలయం (సీఈఓ) రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ.. సోమవారం మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధుల్లో ఉన్న మణిపూర్ పోలీసు సిబ్బంది తన సర్వీస్ రైఫిల్ వల్ల ప్రమాదవశాత్తు జరిగిన కాల్పుల్లో అనుమానాస్పదంగా రీతిలో మృతి చెందినట్లు తెలిపారు.
ఈ ఘటన చురచంద్పూర్ జిల్లాలోని తిపైముఖ్ అసెంబ్లీ నియోజకవర్గంలో చోటుచేసుకుంది. పోలీసు సిబ్బందిని కక్చింగ్ జిల్లాకు చెందిన నౌరెమ్ ఇబోచౌబాగా గుర్తించారు.
మణిపూర్ ఎన్నికలు: దొంగ ఓట్ల ఆరోపణలు వచ్చిన వివిధ నియోజకవర్గాలు
* ఉల్లోక్ నంబోల్
* కాబో లీకై వాంగ్ఖీ
* హేంగ్లింగ్
* చురచంద్పూర్
మణిపూర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్ నియోజకవర్గం హీంగాంగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
సీఎం ఎన్ బీరెన్ సింగ్ నియోజకవర్గం హీంగాంగ్లోని ఓటింగ్ కేంద్రం తన ఏజెంట్లను పోలింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి అనుమతించకపోవడంపై స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల అధికారికి వ్రాతపూర్వక ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కాస్త ఉద్రిక్తత వాతావారణం చోటు చేసుకుంది.
ఓటర్లు నిరసన
వాంగ్ఖీ నియోజకవర్గంలోని కబో లైకై కేంద్రంలో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఓటర్లు నిరసన తెలిపారు
కాంగ్పోక్పీ జిల్లాలో జరిగిన ఘర్షణల్లో ఈవీఎం ధ్వంసం
మణిపూర్లోని కాంగ్పోక్పి జిల్లా సైకుల్ నియోజకవర్గంలోని లెప్లెన్ గ్రామంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓటింగ్ క్రేంద్రంలోని ఈవీఎంలు దెబ్బతిన్నాయి.
మధ్యాహ్నానికి కల్లా మణిపూర్ ఓటింగ్ ఎంతంటే..
మణిపూర్ అసెంబ్లీ 2022 ఎన్నికలు.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 48.88 % ఓటింగ్ నమోదు.
మందకొడిగా మణిపూర్ పోలింగ్ ఓటింగ్
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫేస్ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఉదయం 11 గంటల వరకు 27.34 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది.
మణిపూర్: ఉదయం 9.30 గంటల వరకు 8.94 శాతం పోలింగ్
మణిపూర్లో తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9.30 గంటల వరకు 8.94 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికలు అధికారులు పేర్కొన్నారు. ఓట్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు.
మణిపూర్: ఓటేసిన డిప్యూటీ సీఎం
మణిపూర్ డిప్యూటీ సీఎం, ఎన్పీపీ అభ్యర్థి యుమ్నం జోయ్కుమార్ సింగ్ ఇంఫాల్లోని నౌరెమ్థాంగ్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో తన ఓటు హక్క వినియోగించుకున్నారు.
మణిపూర్: ఓటు వేసిన గవర్నర్
మణిపూర్ రాష్ట్ర గవర్నర్ లా గణేశన్ ఇంఫాల్లోని తంఫాసనా బాలికల హయ్యర్ సెకండరీ స్కూల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మన దేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉందని, దానికి సంకేతమే ఈ ఎన్నికలని గుర్తుచేశారు.మణిపూర్ ప్రజలందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగి వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది.ఓటర్లు ఓటు వేయడానికి క్యూలైన్లలో నిల్చున్నారు.
మణిపూర్: కొనసాగుతోన్న తొలి దశ పోలింగ్
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటు చేశారు.

ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న బీజేపీ
2017లో జరిగిన ఎన్నికల్లో 60 సీట్లకుగాను బీజేపీ 21 చోట్ల నెగ్గింది. ఎన్పీపీ, ఎన్పీఎఫ్, తృణమూల్ కాంగ్రెస్, ఒక స్వతంత్య్ర అభ్యర్థి మద్దతుతో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈసారి సుస్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు ఉవ్విళ్లూరుతోంది.
మణిపూర్: సీఎం పోటీ చేస్తున్న స్థానానికి పోలింగ్
సీఎం బీరెన్ సింగ్ పోటీ చేస్తున్న స్థానంలో సోమవారం పోలింగ్ జరుగుతోంది. దాదాపు రెండు నెలలు బీజేపీ, కాంగ్రెస్లు హోరాహోరీగా ప్రచారం చేసిన విషయం విదితమే.
మణిపూర్: ప్రారంభమైన తొలి దశ పోలింగ్
ఇంఫాల్: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉదయం 7 గంటలకు 38 స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ తొలి దఫాలో 15 మంది మహిళలుసహా 173 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం–1958 తొలగింపు డిమాండ్, రాష్ట్ర అభివృద్ధి, మహిళా సాధికారత, నిరుద్యోగం, అవినీతి అంశాలు ఓటింగ్పై సరళిపై ప్రభావం చూపనున్నాయి.
Related News By Category
Related News By Tags
-
ఆయన ఆదేశిస్తే రాజీనామాకు రెడీ: దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు దానం తెలిపారు. తనకు ఎన్నికల్లో పోటీ చేయడం కొత్తేమీ క...
-
పరిశ్రమల భూముల్లో కమర్షియల్ కాంప్లెక్స్లు, విల్లాలా?
కుత్బుల్లాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీ పేరుతో రూ.5 లక్షల కోట్ల భారీ భూ కుంభకోణానికి పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ పారిశ్రామికవాడల్లోని రూ. ...
-
7న కాంగ్రెస్ రెండేళ్ల వైఫల్యాలపై మహాధర్నా
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 7న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇందిరాపార్కు వద్ద.. కాంగ్రెస్ రెండేళ్ల పాల నా వైఫల్యాలపై ‘గల్లంతైన గ్యారంటీలు – నెరవేరని వాగ్దానాలు, ప్రజా వంచనకు రెండేళ్లు’ నినాదం...
-
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు
సాక్షి, ఆదిలాబాద్: సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా భావించి నాలుగు కోట్ల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. వీటిని ముందుకు తీసుకెళ్లాలంటే కేంద్ర, రాష్ట్ర...
-
బీజేపీకి.. ‘ఈశాన్యం’ పోటు..!
2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణం చేసినప్పటి నుంచి రాష్ట్రాలపై బీజేపీ జైత్రయాత్ర అప్రతిహతంగా సాగుతూ వస్తోంది. ఒడిశా లాంటి రాష్ట్రాలను సైతం కైవసం చేసుకున్న కాషాయదళం.. పశ్చిమ బెంగాల్ మాదే అంటోం...


