ఎంపీ రఘురామకృష్ణ రాజుకు లోక్‌సభ సచివాలయం నోటీసులు | Lok Sabha Secretariat Issue Notice To MP Raghu Ramakrishna Raju | Sakshi
Sakshi News home page

ఎంపీ రఘురామకృష్ణ రాజుకు లోక్‌సభ సచివాలయం నోటీసులు

Jul 15 2021 9:51 PM | Updated on Jul 15 2021 10:05 PM

Lok Sabha Secretariat Issue Notice To MP Raghu Ramakrishna Raju - Sakshi

న్యూఢిల్లీ: ఎంపీ రఘురామకృష్ణ రాజుకు లోక్‌సభ సచివాలయం గురువారం నోటీసు అందించింది. అనర్హత పిటిషన్‌పై 15 రోజుల్లోగా జవాబు చెప్పాలని ఆదేశించింది. రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని.. వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ ఏడాది కిందటే ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఇటీవల పథకం ప్రకారం.. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారిని కించపరుస్తూ, ఓ సామాజిక వర్గాన్ని, ఓ మతాన్ని టార్గెట్‌ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్న రఘురామకృష్ణరాజుపై సీఐడీ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement