Lok sabha elections 2024: ‘మూడో విడత’కు నేడు నోటిఫికేషన్‌ | Lok sabha elections 2024: ECI to start nomination process for third phase | Sakshi
Sakshi News home page

Lok sabha elections 2024: ‘మూడో విడత’కు నేడు నోటిఫికేషన్‌

Apr 12 2024 6:23 AM | Updated on Apr 12 2024 6:23 AM

Lok sabha elections 2024: ECI to start nomination process for third phase - Sakshi

ఈనెల 19 వరకు నామినేషన్లకు అవకాశం 

12 రాష్ట్రాల్లోని 94 లోక్‌సభ స్థానాల్లో మే 7న పోలింగ్‌

సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక సమరంలో మూడో విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. మూడో విడతలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 లోక్‌సభ స్థానాల్లో మే 7వ తేదీన పోలింగ్‌ జరగనుంది. వీటితోపాటు అభ్యర్థి మృతితో రెండో విడతలో వాయిదా పడిన మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ లోక్‌సభ నియోజకవర్గానికి మే 7నే పోలింగ్‌ ఉంటుంది. శుక్రవారం మూడో విడత ఎన్నికల ప్రక్రియకు  నోటిఫికేషన్‌ వచ్చాక నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది.

ఈ 94 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్‌ 19 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్‌ 20న ఉంటుంది. మూడో విడతలో అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌తదితర రాష్ట్రాల్లో మే 7న ఎన్నికలు జరుగనున్నాయి. గుజరాత్‌లోని విజాపూర్, ఖంభట్, వఘోడియా, మానవదర్, పోర్‌బందర్‌ అసెంబ్లీ స్థానాలతో పాటు, పశి్చమబెంగాల్‌లోని భగవాన్‌గోలా, కర్ణాటకలోని షోరాపూర్‌ (ఎస్టీ) అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక పోలింగ్‌ జరుగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement