ఐఏఎస్​ల మధ్య రగడ​: లెక్కలు ఇవిగో..!

karnataka IAS Officer Shilpa Nag Gives Clarity On CSR Funds - Sakshi

మైసూరు(కర్ణాటక): సీఎస్​ఆర్​ ఫండ్స్​ రూ. 12 కోట్ల నిధుల లెక్కలు అడగడం తప్పా? అని కలెక్టర్ రోహిణి సింధూరి చేసిన వ్యాఖ్యలపై మైసూరు పాలికె కమిషనర్​ శిల్పానాగ్​ స్పందించారు. ఆ లెక్కలకు సంబంధించిన డాక్యుమెంట్లను విడుదల చేశారు. కరోనా కట్టడికి వార్డు స్థాయిలో చేపట్టిన చర్యలు,టాస్క్​ ఫోర్స్​, సహయవాణి ఏర్పాటు, వివిధ సంస్థల నుంచి కొనుగోలు చేసిన సామాగ్రికి చెల్లించిన బిల్లులు తదితరాలతో 127 పేజీల నివేదికను నగరాభివృద్ధిశాఖ ప్రధాన కార్యదర్శికి సమర్పించారు.

ఈత కొలను అవసరామా?
ప్రపంచ ప్రఖ్యాత మైసూరు ప్యాలెస్​లోనే స్విమ్మింగ్​ పూల్​ లేదని, అలాంటప్పుడు కలెక్టర్​ రోహిణి సింధూరి బంగ్లాలో ఎందుకని మాజీమంత్రి ఎ.మంజు అన్నారు. మైసూరులో మీడియాతో మాట్లాడుతూ మొదట తాను ఒక ప్రజా సేవకులిననే విషయాన్ని ఆమె గుర్తుంచుకోవాలన్నారు. తానే కరెక్టు, తనకే అన్ని తెలుసు అనే భావన వీడాలన్నారు.

చదవండి: ఐఏఎస్‌ భావోద్వేగం.. ఉద్యోగానికో దండం.. రాజీనామా చేస్తున్నా
కరోనా మరణాల లెక్కలు.. కలెక్టర్‌ వర్సెస్‌ ఎమ్మెల్యే

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top