‘40% కమీషన్‌’పై న్యాయ విచారణ | Karnataka govt orders judicial probe into 40 per cent commission scam' | Sakshi
Sakshi News home page

‘40% కమీషన్‌’పై న్యాయ విచారణ

Aug 19 2023 6:26 AM | Updated on Aug 19 2023 6:26 AM

Karnataka govt orders judicial probe into 40 per cent commission scam' - Sakshi

బెంగళూరు: గత బీజేపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు 40 శాతం కమీషన్‌ డిమాండ్‌ చేశారనే ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. మూడు నెలల క్రితం రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్‌ సర్కారు..హైకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్‌ నాగమోహన్‌ దాస్‌ సారథ్యంలోని కమిటీకి విచారణ బాధ్యతలను అప్పగిస్తూ శుక్రవారం ఆదేశాలిచ్చింది.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీల్లో 40 శాతం కమీషన్‌ కుంభకోణంపై విచారణ జరిపించడం కూడా ఉంది. భారీగా పనులు చేపట్టిన శాఖలపై ఈ కమిషన్‌ విచారణ చేపట్టనుంది. అన్ని ప్రజా పనుల్లో 40 శాతం కమీషన్‌ తమ నుంచి వసూలు చేస్తున్నారంటూ కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం అప్పట్లో ప్రధానికి, సీఎంకు లేఖలు రాయడం గమనార్హం. పనులు ప్రారంభించకమునుపే 25 నుంచి 30 శాతం వరకు కమీషన్‌ను ప్రజాప్రతినిధులకు చెల్లించినట్లు కాంట్రాక్టర్లు అందులో
ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement