ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం, పొగమంచు.. హెచ్చరికలు జారీ | Fog Layer Covered Parts Of Delhi And Temperature dropped | Sakshi
Sakshi News home page

ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం, పొగమంచు.. హెచ్చరికలు జారీ

Dec 19 2024 10:13 AM | Updated on Dec 19 2024 10:49 AM

Fog Layer Covered Parts Of Delhi And Temperature dropped

సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం, పొగమంచు కమ్మేసింది. తాజా పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. విజిబులిటి 500 మీటర్లకు పడిపోయినట్టు అధికారులు తెలిపారు. వాహనాల కాలుష్యం, పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీ గ్యాస్‌ చాంబర్‌లా మారిపోయింది.

ఢిల్లీలో కాలుష్యం, పొగ మంచు కారణంగా విజిబులిటీ 500 మీటర్లకు పడిపోయింది. దీంతో, వాయు కాలుష్యం సీవియర్‌ ప్లస్‌ కేటగిరిలో కొనసాగుతోంది. కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ ఎన్సీఆర్‌లో గ్రాఫ్‌-4 చర్యలు కొనసాగుతున్నాయి. ఇక, ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌పై ఢిల్లీలో సగటున 448 పాయింట్లుగా గాలి నాణ్యత నమోదైంది. ఢిల్లీలో చలి తీవ్రత పెరగడం, పొగమంచు, వాహన కాలుష్యం, పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీ గ్యాస్‌ చాంబర్‌లా మారిపోయింది. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరికలు జారీ చేసింది. వృద్దులు, పిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారు బయటకు వెళ్లవద్దని సూచనలు చేసింది.

 

మరోవైపు.. గురువారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం అక్షర్‌ధామ్‌ ఏరియాలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు చేరుకుంది. దీంతో, దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. దీంతో, ప్రజలు వణికిపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement