కర్వార్‌ నేవీ బేస్‌లో  ‘సాగర్‌’ జలప్రవేశం | Defence minister Rajnath Singh flags off IOS SAGAR at Karwar naval base | Sakshi
Sakshi News home page

కర్వార్‌ నేవీ బేస్‌లో  ‘సాగర్‌’ జలప్రవేశం

Apr 6 2025 12:28 AM | Updated on Apr 6 2025 12:28 AM

Defence minister Rajnath Singh flags off IOS SAGAR at Karwar naval base

పలు ప్రాజెక్టులను ప్రారంభించిన రాజ్‌నాథ్‌

కర్వార్‌ (కర్నాటక): వ్యూహాత్మకంగా కీలకమైన కర్నాటకలోని కర్వార్‌ నేవీ బేస్‌లో శనివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇండియన్‌ ఓషన్‌ షిప్‌ ఐవోఎస్‌ సాగర్‌ (సెక్యూరిటీ అండ్‌ గ్రోత్‌ ఫర్‌ ఆల్‌ ఇన్‌ ది రీజియన్‌)ను జెండా ఊపి జల ప్రవేశం చేయించారు. దీంతోపాటు ఆయన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మిలటరీ హెలికాప్టర్‌లో కర్వార్‌కు చేరుకున్న రాజ్‌నాథ్‌ ‘సీబర్డ్‌’లో భాగమైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారని రక్షణ శాఖ తెలిపింది. 

జల ప్రవేశం చేయించిన ఐవోఎస్‌ సాగర్‌లో 9 దేశాల నావికా దళాలకు చెందిన 44 మంది సిబ్బంది ఉంటారని పేర్కొంది. హిందూ మహా సముద్ర ప్రాంత భవిష్యత్తును నిర్ణయించడంలో ఐవోఎస్‌ సాగర్‌ కీలకంగా మారనుందని రక్షణ శాఖ ‘ఎక్స్‌’లో తెలిపింది. ఈ ప్రాంత దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు భారత్‌కు ఇది ఎంతో సాయపడుతుందని తెలిపింది. సీబర్డ్‌ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన విస్తరణ పనులతో కర్వార్‌ నేవీ బేస్‌లో 32 యుద్ద నౌకలు, సబ్‌మెరీన్లను నిలిపేందుకు అవకాశమేర్పడింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement