అంబులెన్స్‌ను చూసి కరోనా రోగి పరార్‌..

Covid Patient Escaped From Doctors In Karnataka - Sakshi

సాక్షి,యశవంతపుర(కర్నాటక): గ్రామంలోకి వచ్చిన అంబులెన్స్‌ను చూసి కరోనా రోగి పారిపోయిన ఘటన హావేరిలో జరిగింది. కాగా, కబ్బూరు తండాకు చెందిన ఒక  వ్యక్తికి కరోనా సోకింది. అతడు కరోనా సోకిన కూడా బైట స్వేచ్చగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తి కొద్దిరోజులుగా  అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. గ్రామస్థులు అతడిని ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకోవాలని కోరినా ఏవరి మాట వినలేదు.

దీంతో, అతడిని ఎలాగైనా ఆసుపత్రికి తరలించాలని గ్రామస్థులు భావించారు. ఈ క్రమంలో.. స్థానికంగా ఉన్నా ఒక ఆసుపత్రికి సమాచారం అందించారు. అతడిని ఆస్పత్రికి తరలించడానికి గ్రామంలోకి అంబులెన్స్‌ వచ్చింది. దీనిని గమనించిన సదరు వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. అంబులెన్స్‌ సిబ్బంది, గ్రామస్తులు ఎంత గాలించినా కూడా ఆ వ్యక్తి కనిపించలేదు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top