సెల్‌ఫోన్‌ కోసం గొడవ.. యువతిని రైలు నుంచి తోసేయడంతో | Chennai: Woman Dies After Falling Off Running Train | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌ కోసం గొడవ.. యువతిని రైలు నుంచి తోసేయడంతో

Jul 9 2023 1:42 PM | Updated on Jul 9 2023 1:42 PM

Chennai: Woman Dies After Falling Off Running Train - Sakshi

సాక్షి, చెన్నై: చైన్నె కందన్‌చావడి, తిరువిక వీధికి చెందిన శశి కుమార్‌ కుమార్తె ప్రీతి(22).. కొట్టూరుపురంలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తోంది. ఆమె ఈనెల 2వ తేదీ సాయంత్రం, పని ముగించుకుని, సబర్బన్‌ రైలులో ప్రయాణించింది. ఆ సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రీతి వద్ద సెల్‌ఫోన్‌ లాక్కోవడానికి యత్నించారు. ఈ సమయంలో వారితో గొడవపడింది.

రైలు ఇందిరా నగర్‌ స్టేషన్‌ సమీపంలోకి రాగానే కోపోద్రిక్తులైన ఇద్దరు వ్యక్తులు ప్రీతీని కిందకు నెట్టారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. తోటి ప్రయాణికులు, రైల్వే పోలీసులు ఆమెను రాయపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె శనివారం ఉదయం మృతి చెందింది.

కూతురు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో తిరువాన్ముయూర్‌ రైల్వే పోలీసులు ఇందిరా నగర్‌ రైల్వేస్టేషన్‌ సహా ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించారు. ఈ నేపథ్యంలో పట్టి నపాక్కంకు చెందిన విఘ్నేష్‌ (27), అడియార్‌కు చెందిన మణిమారన్‌ (26) నిందితులుగా గుర్తించి అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: అంతు చిక్కని మిస్టరీ..మార్లిన్‌ శాంటానా మూడు రోజుల పాప కథ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement