సివిల్‌ సర్వీస్‌ క్యాడర్‌కు...  ఇకపై నాలుగు జోన్లు  | Centre Govt rejigs cadre allocation policy for IAS, IPS and IFoS | Sakshi
Sakshi News home page

సివిల్‌ సర్వీస్‌ క్యాడర్‌కు...  ఇకపై నాలుగు జోన్లు 

Jan 25 2026 4:44 AM | Updated on Jan 25 2026 4:44 AM

Centre Govt rejigs cadre allocation policy for IAS, IPS and IFoS

ఐదు నుంచి తగ్గించిన కేంద్రం 

న్యూఢిల్లీ: ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఫారెస్ట్‌ సర్వీస్‌ ఉద్యోగుల కేడర్‌ కేటాయింపులు తదితర నియమ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఇందుకోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఇప్పటిదాకా ఐదు జోన్లుగా విభజించగా ఇప్పుడు ఆ సంఖ్యను నాలుగుకు తగ్గించింది. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో ఈ మేరకు పేర్కొంది.
 గ్రూప్‌ 1లో అరుణాచల్‌ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్రపాలిత ప్రాంతాలు, ఏపీ, అస్సాం–మేఘాలయ, బిహార్, ఛత్తీస్‌గఢ్‌; 
గ్రూప్‌ 2లో గుజరాత్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్‌; 
గ్రూప్‌ 3లో మహారాష్ట్ర, మణిపూర్, నాగాలాండ్, ఒరిస్సా, పంజాబ్, రాజస్తాన్, సిక్కిం, తమిళనాడు; 
గ్రూప్‌ 4లో తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌ను అక్షరక్రమంలో చేర్చారు. 

ప్రతి రాష్ట్రం తన పరిధిలో ఈ సర్వీసుల తాలూకు ఖాళీలను ఏటా జనవరి 31 నాటికి కేంద్రానికి విధిగా నివేదించాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ఆ ఏడాది భర్తీ చేయబోయే మొత్తం ఖాళీల సంఖ్యను కేంద్రం నిర్ధారిస్తుంది. అలాగే అధికారులకు హోం కేడర్‌ కేటాయింపు తదితర నిబంధనల్లో కూడా స్వల్ప మార్పుచేర్పులు చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement