పహల్గాం ఉగ్రదాడికి మద్దతుగా సోషల్‌ మీడియాలో పోస్టులు.. 19 మంది అరెస్ట్‌ | Among 19 Arrested For Posting Supporting Tweets On Jammu And Kashmir Pahalgam Terror Attack, More Details Inside | Sakshi
Sakshi News home page

పహల్గాం ఉగ్రదాడికి మద్దతుగా సోషల్‌ మీడియాలో పోస్టులు.. 19 మంది అరెస్ట్‌

Apr 27 2025 10:11 AM | Updated on Apr 27 2025 12:03 PM

Among 19 Arrested For Remarks On pahalgam incident

ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి సానుభూతి పరుల్ని పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు. తాజాగా,పహల్గాం ఉగ్రదాడిపై నోరుపారేసుకున్న సుమారు 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ 19మంది అస్సాం,మేఘాలయా,త్రిపురకు చెందిన వారేనని పోలీసులు వెల్లడించారు.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్రం సోషల్‌ మీడియాపై దృష్టిసారించింది. పహల్గాం ఉగ్రదాడికి మద్దుతు పలికేలా మాట్లాడినా, సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది.

ఈ తరుణంలో పహల్గాం దాడికి మద్దతు పలికేలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడంతో పాటు, పాకిస్తాన్‌ జిందాబాద్‌ అంటూ స్లోగన్‌ను వినిపించిన అస్సాం, మేఘాలయా, త్రిపురకు చెందిన మొత్తం 19మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ 19 మందిలో 14 మంది అస్సాంకు చెందిన వారేనని పోలీసులు  గుర్తించారు. 

వారిపై కఠిన చర్యలు తప్పవ్‌
అయితే, ఈ అరెస్టులు,సోషల్‌ మీడియా పోస్టులపై అస్సాం సీఎం హేమంత్‌ బిశ్వశర్మ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. పహల్గాం ఉగ్రదాడి లేదంటే దేశానికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియా పోస్టులు పెట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అవసరమైతే, వారిపై జాతీయ భద్రతా చట్టంలోని నిబంధనలను విధిస్తామన్నారు. భారత్,పాకిస్తాన్ మధ్య ఎటువంటి సారూప్యతలు లేవు. రెండు దేశాలు శత్రు దేశాలు. మనం అలాగే ఉండాలి’ అని సీఎం హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యానించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement