బ్యాలెట్‌ రావాలి: అఖిలేశ్‌  | Akhilesh Yadav pitches for ballot voting, says EVMs not trustworthy | Sakshi
Sakshi News home page

బ్యాలెట్‌ రావాలి: అఖిలేశ్‌ 

Dec 30 2024 6:09 AM | Updated on Dec 30 2024 6:09 AM

Akhilesh Yadav pitches for ballot voting, says EVMs not trustworthy

లక్నో: ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ యంత్రా(ఈవీఎం) లపై విశ్వసనీయత సడలుతున్నందున బ్యాలెట్‌ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఆదివారం డిమాండ్‌ చేశారు. ‘జర్మనీ వంటి దేశాలు కూడా బ్యాలెట్‌ పేపర్లే వాడుతున్నాయి. 

భారత్‌లో మాత్రం అధికార పెద్దలు స్వలాభం కోసం ఈవీఎంలను వాడుతున్నారు. వాటినెవరూ నమ్మడం లేదు. ఎన్నికల్లో గెలిచే వారు సైతం తమకు వాటిపై నమ్మకం లేదంటున్నారు’’ అని చెప్పారు. భారత సంతతికి చెందిన జర్మనీ ఎంపీ రాహుల్‌కుమార్‌ కాంబోజ్‌ కూడా మీడియాతో మాట్లాడారు. ‘‘బ్యాలెట్‌ పేపర్లు వాడితే పోలింగ్‌లో తేడాలున్నట్లు అనుమానం వస్తే రీ కౌంటింగ్‌కు అవకాశముంటుంది. జర్మనీలో దీన్నే అనుసరిస్తున్నారు’’ అని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement