శ్రీలంక నేవీ అదుపులో 55 మంది తమిళ జాలర్లు | 55 TN fishermen arrested, 8 boats seized by Sri Lankan Navy | Sakshi
Sakshi News home page

శ్రీలంక నేవీ అదుపులో 55 మంది తమిళ జాలర్లు

Dec 20 2021 6:23 AM | Updated on Dec 20 2021 6:23 AM

55 TN fishermen arrested, 8 boats seized by Sri Lankan Navy - Sakshi

రామేశ్వరం: తమిళనాడుకు చెందిన 55 మంది జాలర్లతోపాటు 8 మర పడవలను శ్రీలంక నావికాదళం ఆదివారం అదుపులోకి తీసు కుంది. ఈ నెల18న రామేశ్వరం నుంచి కట్చ తీవు దీవికి 500 బోట్లలో వెళ్లిన మత్స్య కారుల్లో 43 మందిని, 6 బోట్లను శ్రీలంక నేవీ అదుపులోకి తీసుకుందని మత్స్యశాఖ తెలిపిం ది. తమిళ మత్స్యకారులపై శ్రీలంక నేవీ దౌర్యన్యాలు ఎక్కువయ్యాయని తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఆరోపించారు. జాలర్లందరినీ వెంటనే విడిపించాలని, ఇప్పటి వరకు శ్రీలంక ఆధీనంలో ఉన్న మొత్తం 73 పడవలను విడుదల చేయించాలని  విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ను కోరారు. తమ వారిని విడు దల చేసే వరకు నిరాహార దీక్ష చేపడతామని మత్స్యకారుల సంఘం హెచ్చరించింది. 

Advertisement
 
Advertisement
Advertisement