కర్ణాటకలో విషవాయువు లీకేజీ... ఐదుగురి దుర్మరణం

5 Workers Die Of Asphyxiation At Fish Processing Unit In Karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో చేపల ప్రాసెసింగ్‌ పరిశ్రమలో విషవాయువు లీకై ఐదుగురు కార్మికులు మరణించారు. శ్రీ ఉల్కా మత్స్య సంస్కరణ కర్మాగారంలో ఈ ప్రమాదం జరిగింది. 20 అడుగుల లోతున్న ట్యాంకు నుంచి చేపలను బయటకు తీసేందుకు ఆదివారం రాత్రి 8 మంది కార్మికులు దిగారు. చేపల వ్యర్థాలను తొలగించేందుకు వాడే విష వాయువు లీకవడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు సోమవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top