జాతీయ రహదారులు రక్తసిక్తం | 2300 People die on ten highways in India | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారులు రక్తసిక్తం

Jun 24 2025 6:01 AM | Updated on Jun 24 2025 6:01 AM

2300 People die on ten highways in India

దేశంలోని పది హైవేలపై 2,300 మంది మృత్యువాత 

2023 లెక్కల ప్రకారం... టాప్‌–1లో గుజరాత్‌ 

213 మంది మరణాలతో టాప్‌–3లో ఆంధ్రప్రదేశ్‌

సాక్షి, న్యూఢిల్లీ: ప్రజలను గమ్యస్థానాలకు చేర్చాల్సిన రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. రోడ్లపై నిత్యం పలువురు ప్రాణాలను కోల్పోతుండగా, మరికొందరు గాయపడి మంచాలకు పరిమితమవుతున్నారు. దేశంలోని జాతీయ రహదారులపై 2023లో దాదాపు 2,300 మంది మృత్యువాత పడ్డట్లు జాతీయ రహదారుల డేటా తెలుపుతోంది. 522 కిలోమీటర్ల పొడవు ఉన్న ఎన్‌హెచ్‌–48పై గుజరాత్‌లో 763 మంది మృతి చెందారు.

ఆ ఏడాదిలో దేశంలో ఎక్కువమంది మృతిచెందింది గుజరాత్‌లోనే. 266 కిలోమీటర్ల ఎన్‌హెచ్‌–44పై హరియాణాలో 715మంది మృతి చెందారు. ఇక 154 కిలోమీటర్ల ఎన్‌హెచ్‌–65పై ఆంధ్రప్రదేశ్‌లో 213 మంది దుర్మరణం చెందారు. దేశంలోని పది జాతీయ రహదారుల్లో మృతిచెందిన వారి డేటా ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలిచింది. కేవలం 21మంది మృతిచెందిన రాష్ట్రంగా పుదుచ్చేరి నిలిచింది. ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ.. ఫలితం కనిపించడం లేదు. త్వరితగతిన గమ్యానికి చేరుకోవాలనే లక్ష్యంతో జాతీయ రహదారులపై వేగంగా ప్రయాణిస్తున్న కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టు కేంద్రం గుర్తించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement