నదిలో జేసీబీతో
గుంతను
తవ్వుతున్న దృశ్యం
ఉయ్యాలవాడ: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులతో ఈ ఏడాది కుందూనదిలో నీటి ప్రవాహం నిలిచిపోయింది. నది పూర్తిగా అడుగంటడంతో తాగునీటి కోసం మండల పరిధిలోని కొన్ని గ్రామాలలో ప్రత్యామ్నాయ మార్గం తప్పడం లేదు. మండలంలోని ఆర్.జంబులదిన్నె గ్రామంలో కుందూనదిలో ఊట నీరు లభ్యం కోసం జేసీబీ సహాయంతో గుంతను తవ్వారు. దీంతో కొద్ది మేరకు మంచినీటి సమస్యతో పాటు పశువులకు అవసరాలకు నీరు సమకూరుతుందని గ్రామానికి చెందిన చిట్టెపు రాజగోపాల్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, ప్రజలు పేర్కొన్నారు.


