● 111 నకిలీ డీఏపీ బస్తాల పట్టివేత
● రైతులకు దళారుల టోకరా.. పొలంలో
చల్లిన తర్వాత తెలిసిన నకిలీ బాగోతం
● వ్యవసాయాధికారులకు సమాచారం..
ఆకస్మిక తనిఖీ, బస్తాల స్వాధీనం
● పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ – కల్వకుర్తి
ఐదుగురు ఉద్యోగుల సస్పెన్షన్
మన్ననూర్: స్థానిక పీవీటీజీ పాఠశాల/కళాశాలలోని వసతి గృహంలో వారం రోజుల క్రితం విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ఘటన జరిగిన సంగతి విధితమే. ఈ సందర్భంగా అధికారుల తాత్కాలిక విచారణలో భాగంగా అందుకు బాధ్యులుగా భావించిన ఐదుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అందజేసినట్లు ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. ఈ క్రమంలో సస్పెన్షన్కు గురైన వారి స్థానంలో తాత్కాలిక ప్రాతిపదికగా నియామకాలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పూర్తి విచారణ వరకు ఈ ఉత్తర్వులు ఆచరణలో ఉంటాయని, అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.


