
భరత్, విషికా లక్ష్మణ్
గ్రామీణ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’. భరత్, విషికా లక్ష్మణ్ జంటగా టి. గంగాధర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. ఎం. ప్రదీప్కుమార్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 6న విడుదల కానుంది.
‘‘ఇటీవల విడుదలైన టీజర్కు, తండ్రీకూతుళ్ల సెంటిమెంట్తో వచ్చిన పాటకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది’’ అని చిత్ర యూనిట్ వెల్లడించింది. కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి పెద్దపల్లి రోహిత్ స్వరకర్త.