‘పొన్నియన్‌ సెల్వన్‌ చూసి మణిరత్నంకి ఇంట్లోనే సెల్యూట్‌ చేశా’ | TN Minsitet Dharai Murughan Says He Salute to Maniratnam After Watching PS 1 | Sakshi
Sakshi News home page

Maniratnam-PS-2: పొన్నియన్‌ సెల్వన్‌ చూసి మణిరత్నంకి ఇంట్లోనే సెల్యూట్‌ చేశా: మంత్రి

Mar 31 2023 9:18 AM | Updated on Mar 31 2023 9:18 AM

TN Minsitet Dharai Murughan Says He Salute to Maniratnam After Watching PS 1 - Sakshi

దర్శకుడు మణిరత్నం 25 ఏళ్ల కల నిజం చేసిన చిత్రం పొన్నియిన్‌ సెల్వన్‌. ఇదే పేరుతో  ల్కీ రాసిన నవలçను దర్శకుడు మణిరత్నం  రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఇందులో నటుడు విక్రమ్, కార్తీ, జయంరవి, శరత్‌కుమార్, ప్రకాశ్‌రాజ్, ప్రభు, విక్రమ్‌ ప్రభు, నటి ఐశ్వర్యరాయ్, త్రిష వంటి భారీ తారాగణం ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని మణిరత్నం మెడ్రాస్‌ టాకీస్‌ సంస్థతో కలిసి లైకా ఫిలింస్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మించారు. ఈ చిత్రం మొదటి భాగం గత ఏడాది సెప్టెంబర్‌ నెలలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది.

కాగా రెండవ భాగం ఏప్రిల్‌ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో అభిమానుల సమక్షంలో భారీఎత్తున నిర్వహించారు. తమిళనాడు మంత్రి దురైమరుగన్, విశ్వనటుడు కమలహాసన్, నటి ఐశ్వర్యరాయ్, దర్శకుడు భారతీరాజా, సంచలన నటుడు శింబు, నటి కుష్బూ, సుహాసిని మణిరత్నం, శోభన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ వేదికపై మంత్రి దరైమురుగన్‌ మాట్లాడుతూ ఒక ఛారిత్రక కథను చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా రూపొందించిన అందరికీ ధన్యవాదాలన్నారు. ఈ చిత్రం చూసిన తరువాత దర్శకుడు మణిరత్నానికి ఇంట్లోనే సెల్యూట్‌ చేశానన్నారు. వాద్ధియదేవన్‌ పాత్రలో నటుడు కార్తీ చాలా బాగా నటించారని, తన నియోజక వర్గం పరిధిలోనిదే వాద్ధియదేవన్‌ ఊర్‌ అని మంత్రి పేర్కొన్నారు. కాగా ఈ చిత్రానికి ఏఆర్‌ రహమాన్‌ సంగీతం అందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement