తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త తమిళ సినిమాల విడుదలకు బ్రేకులు వేసింది. సినిమా రిలీజ్లతో పాటు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. థియేటర్- ఓటీటీల వివాదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సినిమా థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి తీసుకురావాలని థియేటర్ యాజమానులు, డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే కొత్త సినిమాలు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచే సినిమాల రిలీజ్ చేయనివ్వమని స్పష్టం చేశారు.


