
నటి ఊర్వశి వారసురాలు హీరోయిన్గా రంగప్రవేశం చేశారు. అమ్మ పాత్రలకు, అమాయకపు రోల్స్కు, ఎక్స్ప్రెషన్స్తోనే నవ్వించగల పాత్రలకు పెట్టింది పేరు ఊర్వశి. ఈమె అసలు పేరు కవిత రంజిని. కేరళలో పుట్టి పెరిగిన ఈమె చైల్డ్ ఆర్టిస్ట్గా వెండితెరకు పరిచయమైంది. ముందనై ముడిచ్చు అనే తమిళ సినిమాతో హీరోయిన్గా మారింది. కొంతకాలంపాటు హీరోయిన్గా నటించిన ఆమె ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలుపుకుని 700కు పైగా చిత్రాలు చేసింది.
ఊర్వశి ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. అయితే, గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కుమార్తె 'తేజ లక్ష్మి' సినీ ఎంట్రీ ఉంటుందని ప్రకటించింది. ఆమె చెప్పినట్లుగానే తాజాగా తన మాతృభాష మలయాళీ ఇండస్ట్రీలో తేజ లక్ష్మి అడుగుపెట్టింది. నటి ఊర్వశి, నటుడు మనోజ్ జయన్ను ప్రేమించి 2000లో పెళ్లి చేసుకుంది. వారిద్దరికి జన్మించిన అమ్మాయే తేజ లక్ష్మి. ఆ తర్వాత మనోజ్తో విభేదాలు రావడంతో అతడితో విడాకులు తీసుకుని 2013లో శివ ప్రసాద్ని పెళ్లి చేసుకుని అతనితో కలిసి జీవిస్తోంది. కానీ తేజలక్ష్మి మాత్రం తన తండ్రితోనే కలిసి ఉంటోంది.

మలయాళంలో 'సుందరియాయవల్ స్టెల్లా' అనే చిత్రంలో కథానాయికగా తేజ లక్ష్మి నటిస్తుంది. నటుడు మనోజ్ కే.విజయన్ తన కూతురు కథానాయకిగా ఎంట్రీ గురించి ఒక భేటీలో ఇలా మాట్లాడారు. 'తేజలక్ష్మికి సినిమాల్లో నటించాలనే కోరిక ఉన్నట్లు మొదట నా రెండో భార్య నాకు చెప్పింది. దీంతో వెంటనే నా కూతురికి ఒక సలహా ఇచ్చాను. ముందు మీ అమ్మ ఊర్వశికి చెప్పి ఆశీస్సులు తీసుకోమని పంపాను. అలాగే ఊర్వశి కూడా ఆమెను మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. ఊర్వశి సమ్మతించకపోతే తేజలక్ష్మి కథానాయకి అయ్యేదే కాదు. ముందుగా మాతృభాషలో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన తేజలక్ష్మి తరువాత తమిళం, తెలుగులో కూడా ఎంట్రీ ఇస్తుంది.' అని ఆయన అన్నారు.