సాయి ధరమ్‌ తేజ్‌ కొత్త సినిమా టైటిల్‌ ఫిక్స్‌..

Sai Dharam Tej Republic Motion Poster Released - Sakshi

దేవకట్టా దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ ఓ పొలిటికల్ డ్రామాలో నటిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ఖరారు చేస్తూ సోమవారం మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ‘రిపబ్లిక్ ఇన్ టు పబ్లిక్’ అంటూ సినిమాను వేసవిలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు జనవరి 26, రిపబ్లిక్ డే కానుకగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ముఖ్యంగా సాయి ధరమ్‌ తేజ్‌ వాయిస్ ఓవర్ ఈ మోషన్ పోస్టర్‌కు ప్రధానాకర్షణగా నిలిచింది. ‘యువరానర్.. ప్ర‌జ‌లు ఎన్నుకున్న రాజకీయ నాయ‌కులు.. శాస‌నాల‌ను అమ‌లు చేసే ప్ర‌భుత్వ ఉద్యోగులు.. న్యాయాన్ని కాపాడే కోర్టు.. ఈ మూడు గుర్రాలు ఒక‌రి త‌ప్పులు ఒక‌రు దిద్దుకుంటూ క్ర‌మ‌బ‌ద్దంగా సాగిన‌పుడే అది ప్ర‌జాస్వామ్యం అవుతుంది.. ప్ర‌భుత్వం అవుతుంది.. అదే అస‌లైన రిప‌బ్లిక్’ అంటూ కోర్టు రూమ్‌లో సాయి ధ‌ర‌మ్ వాయిస్ ఓవ‌ర్ అదిరిపోయింది. చదవండి: ఆచార్య: రామ్‌ చరణ్‌కు జోడీ కుదిరింది

దీనికి తోడు గుర్రాలను చూపిస్తూ చేసిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. చాలా రోజుల తర్వాత దేవా క‌ట్టా నుంచి వస్తున్న పొలిటికల్ సినిమా ఇది. ఈ సినిమా పూర్తిగా రాజకీయాలు, ప్ర‌జాస్వామ్యం నేపథ్యంలోనే తెరకెక్కుతోంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై సీనియర్ నిర్మాతలు భగవాన్, పుల్లారావు నిర్మిస్తున్నారు. ఇక సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా రమ్యకృష్ణ, జగపతిబాబు వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చదవండి: పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన బాలీవుడ్‌ హీరో

కాగా గత రెండేళ్లుగా సాయి వరస విజయాలు అందుకుంటున్నాడు. 2019లో చిత్రలహరి సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన ఈ యువ హీరో.. అదే ఏడాది చివర్లో ప్రతిరోజూ పండగే అంటూ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. గతేడాది సోలో బ్రతుకే సో బెటర్ సినిమా కూడా పర్వాలేదనిపించింది. ఇప్పుడు రిపబ్లిక్ అంటూ మరోసారి పోటీకి సిద్ధమయ్యాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top