Rajinikanth-Aishwarya Rai: 12 ఏళ్ల తర్వాత.. 'రోబో' జోడి రిపీట్‌

Rajinikanth And Aishwarya Rai To Share Screen Space After 12 Years - Sakshi

హీరో రజినీకాంత్‌– హీరోయిన్‌ ఐశ్వర్యారాయ్‌ మరోసారి జోడీ కడుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. వీరిద్దరూ తొలిసారి జంటగా నటించిన చిత్రం ‘రోబో’. శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2010లో విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రజనీ–ఐష్‌ జోడీకి మంచు మార్కులే పడ్డాయి. ‘రోబో’ రిలీజైన పుష్కరానికి (పన్నెండేళ్లు) మరోసారి వీరు జోడీగా నటించనున్నారని టాక్‌.

రజినీకాంత్‌ నటించనున్న 169వ సినిమాకి నెల్సన్‌ దిలీప్‌ దర్శకత్వం వహించనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట నెల్సన్‌. ఇందులో రజినీకి జోడీగా ఐశ్వర్య కనిపించబోతున్నారని భోగట్టా. ఈ జోడీ మరోసారి మ్యాజిక్‌ను క్రియేట్‌ చేయడం ఖాయం అంటోంది కోలీవుడ్‌. త్వరలోనే ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో హీరోయిన్‌ ప్రియాంకా అరుల్‌ మోహన్‌ కీలక పాత్ర చేయనున్నారని టాక్‌.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top