ఇఫీలో మా కాళి | Raima Sen Maa Kaali At IFFI | Sakshi
Sakshi News home page

ఇఫీలో మా కాళి

Nov 28 2024 5:41 AM | Updated on Nov 28 2024 5:41 AM

Raima Sen Maa Kaali At IFFI

రైమా సేన్, అభిషేక్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో విజయ్‌ యెలకంటి దర్శకత్వం వహించిన చిత్రం ‘మా కాళి’. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన మల్టీ లింగ్వల్‌ మూవీ ఇది. హిందీలో నిర్మించిన ఈ చిత్రం బెంగాలీ, తెలుగులో 2025లో విడుదల కానుంది. కాగా ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 55వ ఇఫీ(ఇంటర్నేనేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా) వేడుకల్లో ‘మా కాళి’ సినిమాని ప్రదర్శించారు. ఈ ప్రీమియర్‌ షోకి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్, బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద బోస్, గోవా రాష్ట్ర డీజీపీ అలోక్‌ కుమార్‌ హాజరయ్యారు. 

అనంతరం గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ మాట్లాడుతూ– ‘‘మా కాళి’ చిత్రాన్ని భారతదేశ విభజన, డైరెక్ట్‌ యాక్షన్‌ డే నేపథ్యంలో తీశారు. 1947లో స్వాతంత్య్రం పొందిన మన దేశం ఆ తర్వాత ఇండియా, పాకిస్థాన్ గా మారింది. 1971 నాటికి పాకిస్థాన్, బంగ్లాదేశ్‌గా మారింది. ఒక దేశం మూడు ముక్కలైంది. అయినప్పటికీ భారతదేశం మాత్రమే ఇప్పటికీ రాజ్యాంగాన్ని నమ్ముతుంది. ‘మా కాళి’ వాస్తవ కథ ఆధారంగా రూపొందించబడింది. డైరెక్ట్‌ యాక్షన్‌ డే అనేది మన దేశ చరిత్రలో ఒక బ్లాక్‌ డే’’ అని తెలిపారు. ‘‘మా కాళి’కి ప్రమోద్‌ సావంత్,  ఆనంద బోస్‌గార్ల నుంచి వచ్చిన ప్రశంసల్ని సత్కారంగా భావిస్తున్నాం’’ అన్నారు విజయ్‌ యెలకంటి, నిర్మాత వందనా ప్రసాద్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement