‘రుద్రమాంబపురం’ థియేటర్‌ మూవీ  అంటున్నారు: నిర్మాత | Producer Nanduri Ram Talks About Rudramambapuram Movie | Sakshi
Sakshi News home page

‘రుద్రమాంబపురం’ థియేటర్‌ మూవీ  అంటున్నారు: నిర్మాత

Jul 9 2023 5:18 PM | Updated on Jul 9 2023 5:18 PM

Producer Nanduri Ram Talks About Rudramambapuram Movie - Sakshi

‘రుద్రమాంబపురం’ సినిమా చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. ఇది థియేటర్‌లో రావాల్సిన మూవీ అని చెప్పడం ఆనందంగా ఉంది’ అని నిర్మాత నండూరి రాము అన్నారు. ఎన్‌వీఎల్ ఆర్ట్స్ ప‌తాకంపై నండూరి రాము నిర్మించిన చిత్రం 'రుద్రమాంబపురం'. ఈ చిత్రానికి మ‌హేష్ బంటు ద‌ర్శ‌కత్వం వహించారు. జులై 6 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత నండూరి రాము మీడియాతో మాట్లాడుతూ.. ‘సినిమా చూసిన ప్రతి ఒక్కరు బాగుందని చెబుతున్నారు. నటులు అజయ్ ఘోష్, రాజశేఖర్ పోటీ పడి నటించారు.యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి మంచి విజయం అందించిన ఓటీటీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. త్వరలోనే ఎన్‌వీఎల్ ఆర్ట్స్ పతాకంపై మరో సినిమాను అనౌన్స్‌ చేస్తాం’ అన్నారు. ఈ చిత్రంలో శుభోద‌యం సుబ్బారావు, అజయ్ ఘోష్, అర్జున్ రాజేష్, పలాస జనార్దన్, నండూరి రాము, సాయి, శంకర్, డివి.సుబ్బారావు, ప్రమీల, రజిని శ్రీకళ, రత్నశ్రీ, షెహనాజ్, రజిని, సురేఖ, రమణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement