
పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్న్యూస్. ఆయన నెక్ట్స్ సినిమాకు సంబంధించి అప్డేట్ వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన డీవీవీ ఎంటర్టైన్స్మెంట్స్ బ్యానర్లో పవన్ హీరోగా ఓ సినిమాను ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రన్రాజారన్తో దర్శకుడిగా మారిన సుజీత్ ప్రభాస్తో సాహో వంటి పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడీ యంగ్ డైరెక్టర్ పవన్తో సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. మొత్తం ఎరుపు రంగుతో డిజైన్ చేసిన పోస్టర్లో జపనీస్ అక్షరాలు కూడా ఉన్నాయి. జపాన్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కే గ్యాంగ్స్టర్ డ్రామా అని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్మీదకి వెళ్లనుంది.
We are extremely elated to associate with @PawanKalyan Garu, for our next production.⚡️⭐️
— DVV Entertainment (@DVVMovies) December 4, 2022
Directed by @SujeethSign, DOP by @DOP007.#FirestormIsComing 🔥🔥 pic.twitter.com/Dd91Ik8sTK