Parugu Movie Heroine Sheela Kaur Latest Pics, Present Life Story in Telugu - Sakshi
Sakshi News home page

Sheela Kaur: పరుగు’ హీరోయిన్‌ ఇప్పుడెలా ఉంది? పెళ్లి తర్వాత ఏం చేస్తుందో తెలుసా?

Jan 22 2023 12:28 PM | Updated on Jan 22 2023 12:49 PM

Parugu Movie Heroine Sheela Kaur Latest Pics, Present Life Story In Telugu - Sakshi

టాలీవుడ్‌లోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు, పోతుంటారు. వారిలో కొంతమంది మాత్రమే నిలకడగా రాణిస్తారు. మరికొంతమంది హీరోయిన్లు త‌క్కువ సినిమాలు చేసినా కూడా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో నిలిచిపోతుంటారు.  అలాంటి వారిలో షీలా కౌర్‌ ఒకరు. అల్లు అర్జున్‌ ‘పరుగు’ ద్వారా టాలీవుడ్‌ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. 

అంతకు ముందు చైల్డ్‌ ఆరిస్ట్‌గా దాదాపు 20 సినిమాల్లో నటించిన షీలా.. నవదీప్‌ ‘సీతాకోక చిలుక’తో హీరోయిన్‌గా మారింది. ఈ సినిమా త‌ర‌వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన ప‌రుగు సినిమాతో సూప‌ర్ హిట్ అందుకుంది. అందులో అమాయ‌కంగా క‌నిపిస్తూనే త‌నదైన నటన,అందంతో కుర్రకారులను ఆకర్షించింది. ఆ సినిమాలో ‘ముఖం చూపించి మాట్లాడు..’ అనే డైలాగ్‌ చాలా ఫేమస్‌ అయింది.

 

పరుగు తర్వాత  రాజు భాయ్, హలో ప్రేమిస్తారా, మస్కా, అదుర్స్‌ తదితర తెలుగు సినిమాలతో పాటు తమిళ చిత్రాల్లోనూ నటించింది.  చివరిగా 2011లో బాలకృష్ణ నటించిన పరమవీరచక్ర సినిమాలో నటించింది. ఆ తర్వాత వెండితెరపై కనిపించలేదు. ఆమె క్యాన్సర్‌ బారిన పడ్డారని, అందుకే సినిమాలకు దూరంగా ఉన్నారని అప్పట్లో వదంతులు వచ్చాయి.

మూడేళ్ల క్రితం ఓ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకొని అందరికి షాకిచ్చింది షీలా. 2020 మార్చిలో కేరళకు చెందిన ఒక వ్యాపారవేత్త సంతోష్ రెడ్డితో సీలా వివాహం జరిగింది. చెన్నైలో కుటుంబ సభ్యులు ,సన్నిహితుల సమక్షంలో ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ గా ఈ వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తన భర్తతో కలిసి సూపర్ మార్కెట్ నడుపుతున్నట్లు తెలుస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement