
ఇప్పుడంటే వెబ్ సిరీసుల హవా కాస్త తగ్గింది కానీ లాక్ డౌన్ టైంలో మాత్రం మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. అలాంటి ఓ సిరీస్ 'పంచాయత్'. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్టైనింగ్గా ఈ సిరీస్కి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. గత మూడు సీజన్లు చూసేసిన చాలామంది కొత్త సీజన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు నాలుగో సీజన్ స్ట్రీమింగ్ అయిపోతోంది.
(ఇదీ చదవండి: హీరోయిన్ సమంతకు కష్టకాలం!)
జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘువీర్ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్కు దీపిక్ కుమార్ మిశ్రా, అక్షత్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. 2020లో తొలి సీజన్ రిలీజ్ కాగా.. 2022, 2024లో రెండు, మూడు సీజన్లు వచ్చాయి. ఇప్పుడు నాలుగో సీజన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇది కేవలం హిందీలోనే అందుబాటులో ఉంది.
పంచాయత్ సిరీస్ గురించి చెప్పుకుంటే చాలా సింపుల్ స్టోరీ. సిటీలో పుట్టి పెరిగిన ఓ కుర్రాడు.. ఓ మారుమూల పల్లెలోకి పంచాయతీ సెక్రటరీగా అడుగుపెడతాడు. జాబ్ అయితే చేస్తుంటాడు గానీ అస్సలు ఇష్టముండదు. విదేశాలకు వెళ్లిపోవాలనేదే ఇతడి డ్రీమ్. అలాంటిది ఇతడిని పల్లెలోని ఉంటే కొందరు మనుషులు మార్చేస్తారు. తర్వాత ఏమైందనేదే స్టోరీ. తొలి మూడు సీజన్లు వివిధ అంశాల ఆధారంగా తెరకెక్కించారు. నాలుగు సీజన్లో పంచాయతీలో జరిగే ఎన్నికల స్టోరీతో తీశారు. ఈసారి కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండనుంది. కామెడీ ప్లస్ ఎమోషనల్గా ఉండే ఈ సిరీస్ ని తెలుగులోనూ 'సివరపల్లి' పేరుతో రీమేక్ చేశారు.
(ఇదీ చదవండి: మరో హీరోయిన్తో తమన్నా మాజీ ప్రియుడు డేటింగ్?)