బలగం ఫేమ్‌ సుధాకర్‌ రెడ్డి చేతుల మీదుగా ఒక్క రోజు.... 48 గంటలు పోస్టర్‌

okka roju 48 gantalu teaser launch - Sakshi

ఆదిత్య బద్వేలి, రేఖా నిరోషా జంటగా నిరంజన్‌ బండి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఒక్క రోజు.. 48 హవర్స్‌’. ప్రీతీ క్రియేషన్స్, హేమలత సమర్పణలో కృష్ణా రెడ్డి, కేకే నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం పోస్టర్‌ను ‘బలగం’ ఫేమ్‌ సుధాకర్‌ రెడ్డి, షేడ్‌ స్టూడియోస్‌ అధినేత బలివాడ దేవి ప్రసాద్‌ ఆవిష్కరించారు.

నిర్మాత కేకే మాట్లాడుతూ– ‘‘మా బేనర్‌లో ఇది తొలి చిత్రం. మంచి కథాంశంతో రూపొందించిన ఈ చిత్రం ఔట్‌పుట్‌ బాగా వచ్చింది. విజయం పట్ల నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు.  నిరంజన్‌ బండి మాట్లాడుతూ– ‘‘అనుకోని పరిస్థితుల్లో కష్టాలపాలైన హీరో టైమ్‌ ట్రావెల్‌ చేసి తనని ఏ విధంగా కాపాడుకున్నాడు అనేది ఈ సినిమా కథ’’ అన్నారు. ‘‘అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌కి, ప్రొడ్యూసర్స్‌కి థ్యాంక్స్‌’’ అన్నారు ఆదిత్య, రేఖా నిరోషా.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top