రామాయణ పార్ట్‌-1 గ్లింప్స్‌.. రచయితపై నెటిజన్ల ట్రోల్స్! | Netizens Trolls Ramayana Part I Writer Shridhar Raghavan For Taking Story Credit | Sakshi
Sakshi News home page

Ramayana Part I: రామాయణం మీరే రాశారా?.. రచయితపై నెటిజన్స్‌ ట్రోల్స్!

Jul 4 2025 9:14 PM | Updated on Jul 4 2025 9:49 PM

Netizens Trolls Ramayana Part I Writer Shridhar Raghavan For Taking Story Credit

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా మైథలాజికల్ చిత్రం 'రామాయణ'. ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్‌కపూర్‌ , సీతగా సాయి పల్లవి  నటిస్తున్నారు. కేజీఎఫ్ స్టార్ యశ్‌ రావణుడిగా కనిపించనున్నారు. నితిశ్ తివారీ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా గ్లింప్స్‌ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌ మొదలైనప్పటి నుంచి ఇదే తొలి వీడియో కావడం విశేషం. గతంలో రామాయణంపై చాలా సినిమాలొచ్చినా.. ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మరోసారి భారీ బడ్జెట్‌తో రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

అయితే రామాయణం అంటే  అందరికీ గుర్తుకొచ్చేది శ్రీరాముడు మాత్రమే కాదు.. వాల్మీకి పేరు తప్పకుండా ఉంటుంది. అయితే ఈ సినిమాకు కథ అందించిన రచయిత శ్రీధర్‌ రాఘవన్‌పై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు కథను తానే రాసినట్లు చెప్పుకోవడంపై నెటిజన్స్‌ మండిపడుతున్నారు. రామాయణం రచించింది వాల్మీకి అయితే.. ఆ క్రెడిట్‌ కూడా మీరు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. పఠాన్‌, టైగర్-3 చిత్రాలకు కథ అందించిన శ్రీధర్ రాఘవన్‌ రామాయణం కూడా రాశాడంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు.
 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement