Naveen Polishetty: జాతిరత్నాలు తర్వాత నవీన్‌ నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ ఇదే..

Naveen Polishetty To Star In Kalyan Shakars Upcoming Fun Filled Movie - Sakshi

‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు’ తర్వాత నవీన్‌ పోలిశెట్టి హీరోగా నటించనున్న మూడో సినిమా ఖరారయింది. కల్యాణ్‌ శంకర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ 4 సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించనున్న ఈ చిత్రాన్ని బుధవారం ప్రకటించారు. ‘‘

తెలుగు సినిమా శ్రీకారం చుట్టుకున్న రోజున (1931, సెప్టెంబర్‌ 15) ‘ఫార్చ్యూన్‌ 4 సినిమాస్‌’ సంస్థ పురుడు పోసుకోవడం హ్యాపీగా ఉంది. మీరు (ప్రేక్షకులు) మరింత సరదాగా నవ్వుకోవడానికి సిద్ధంగా ఉండండి. మేము వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సమర్పణ: పీడీవీ ప్రసాద్‌. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top