సాధారణంగా కొత్త సినిమాలు రిలీజైనప్పుడు రివ్యూయర్లు గానీ ప్రేక్షకుల గానీ నిడివి విషయంలో కొన్నిసార్లు కంప్లైంట్ చేస్తుంటారు. కానీ దర్శకనిర్మాతలు మాత్రం తాము తీసిన దానిపై ప్రేమతో సీన్స్ కట్ చేయడానికి ఇష్టపడరు. కొన్నిసార్లు మాత్రం ఆడియెన్స్ స్పందనకు తగ్గట్లు ఎడిట్ చేస్తుంటారు. ఇప్పుడు 'నాగబంధం' టీమ్ కూడా అదే చేసింది.
(ఇదీ చదవండి: నేను తెలుగోడినే.. టాలీవుడ్ పట్టించుకోలేదు)
ఈ సినిమాలో విరాట్ కర్ణ, నభా నటేశ్ హీరోహీరోయిన్లుగా నటించగా అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. అనంత పద్మనాభ స్వామి బ్యాక్డ్రాప్లో సోషియో ఫాంటసీ కథతో తీసిన ఈ చిత్రంలో గ్రాఫిక్స్ పరంగా అభిమానుల్ని ఆకట్టుకుంటున్నప్పటికీ కంటెంట్ ఓకే ఓకే అనిపించిందనే కంప్లైంట్స్ వచ్చాయి. ఫైట్స్ సహా కొన్ని సన్నివేశాలు అనవసర నిడివిని పెంచాయనే కామెంట్స్ కూడా వినిపించాయి.
ఇప్పుడు ప్రేక్షకుల స్పందనని పరిగణలోకి తీసుకున్న చిత్రబృందం.. దాదాపు 20 నిమిషాల సన్నివేశాల్ని తొలగించినట్లు తెలిపింది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేసింది. థియేటర్లలో 3 గంటల 5 నిమిషాల నిడివితో మూవీని ప్రదర్శించారు. ఇప్పుడు 2 గంటల 45 నిమిషాల నిడివితో ప్రదర్శించబోతున్నారు.
(ఇదీ చదవండి: ‘నాగబంధం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)


