పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, రవి కిషన్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘మిర్జాపూర్:ది మూవీ’. ఓటీటీలో ‘మిర్జాపూర్’ వెబ్సిరీస్కు మంచి ఆదరణ రావడంతో అదే పేరుతో మరో కొత్త కథతో తెరపైకీ తీసుకొచ్చారు. ఇప్పుడీ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. తొలి రోజు నుంచే మంచి వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం.. ఆదివారం మరింత జోరు చూపించింది. మూడో రోజు ఏకంగా రూ. 36 కోట్ల నెట్ వసూళ్లూ సాధించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఎక్కువమంది చదివింది: ‘హనుమాన్ అంశ్’ కి తగ్గని క్రేజ్.. పంచెకట్టుతో విద్యార్థులు
రూ.100 కోట్లకు చేరువలో..
గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం రూ.25.75 కోట్లతో బోణీ కొట్టింది. శనివారం అదే జోరులో కలెక్షన్లు మరింత పెరిగి రూ. 32 కోట్లకు చేరాయి. ఆదివారం వచ్చే సరికి ఈ చిత్రం రూ.36 కోట్లు రాబట్టింది. దీంతో ఇండియాలో ఈ సినిమా నెట్ కలెక్షన్లు సుమారు రూ. 93.75 కోట్లకు చేరాయి. ఇప్పుడు రూ.100 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టేందుకు దాదాపు రూ.6 కోట్ల దూరంలోనే ఉంది.
ఇదీ చదవండి: బిగ్బాస్లో మొదలైన రచ్చ.. దేనికోసమంటే..?
ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్లు
ఈ చిత్రం.. ఓవర్సీస్లోనూ సత్తా చాటుతోంది. సాక్నిల్క్(గణాంకాల నివేదిక) ప్రకారం మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.132.35 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇందులో దాదాపు రూ.20 కోట్లు ఓవర్సీస్ మార్కెట్ నుంచి వచ్చినట్లు సమాచారం.


